నాయకా ప్రథమంబు నారి తృతీయంబు
మానుగా గూడిన మనుమరాలు
పురుషుని మూడోది పూబోణి మొదటిది
ధనర సంకరమైన తల్లి వావి
పిల్లవానిది రెంట పిల్లది మూడింట
పొసగజేసిన దాది బిడ్డ వావి
పరగనాథుని మూట పడుచుదానిది రెంట
హర్షంబుతోడ మేనత్త యగును
కొడుకు మొదటిది గల రెంట కోడలయ్యే
వరుని రెంటను పతి అది మరదలయ్యే
వైశ్యగోత్రంబులీతీరు వరుస తెలిసి
పెండ్లి చేయరే తెలిసిన పెద్దలెపుడు…
No comments:
Post a Comment