చిత్ర కవిత.
13-06-23
మిర్చి
చూపులకేమో సూదంటురాయి
రుచులలోన కలికితురాయి …
నిగనిగల నూనె మెరుపులతో
ఎంతవారైనను పాదాక్రాంతులే ...
శనగపిండిలోన సరిగంగ తానాలాడి
మురిపంగ మసాలాలతో ముక్కులదురగొట్టు ...
హా హా అనుకుంటుండాగానే గొంతుదాటి
ఓహో అనిపించు మనచేత శెహబాసంటు …
అన్ని తరగతుల ప్రజలకు ఇది
అందుబాటైన ఆహారము…
దోరగా వేయించిన దోబూచులాడు
బంగారు వర్ణముల మర్మమై తోచు…
ప్రతి విందులోన పదిలమై నిలుచు
మందుబాబులకేమో మహిమాన్వితమే…
చిన్నా పెద్దల కిది చిరుదరహాసమే
తెలుగువారందరికి కలికి మాలక్ష్మిలా …
ముసురుపడుతుంటే మురిపించే మంత్రం
చినుకు పడుతుంటే చిద్విలాసమే ….
పరిమితమై తింటే పసందులే
అపరిమితమైతే మాత్రం అనారోగ్యం ….
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment