నిప్పులాంటి నిజాలు
తేది: 26-04-2021
శీర్షిక: ప్రజ్వలన....
కవిత సంఖ్య: 116
పంచభూతాలే ప్రత్యక్ష సాక్షులని
పరమ ధర్మాలెన్ని బోధిస్తే ఏం...
పనిగట్టుకుని వల్లె వేసినా
పట్టించుకునే తీరికేది ....
స్వార్థ చింతనల దాసులయ్యాక
విచక్షణల విసర్జనలే కద
అంతా తమనే...మనదంతా చేతల్లో ...
మంది పనులన్నీ మాటల్లోనే ...
ధర్మం ఎన్ని పాదాలైనా సరే ..
దారిద్రనారాయణులవైనా
దాయాదుల పోరులైనా
దమన నీతులు వల్లిస్తుంది....
యుగాలు దాటిన నిజాలైనా
దశాబ్దాల నాటి దాపరికాలైనా...
మబ్బులు వీడిన సూర్యుడిలా
మండి మనలను మసిచేస్తుందనేది
అక్షర సత్యం...
అయినా వీడదు గ్రహణం ....
అలవాటు వ్యసనమై
తప్పు మీద తప్పు చేస్తూంటే
నిప్పులాంటి నిజాలు ప్రజ్వలించి
కళ్ళముందు కదలాడుతూ
వాటంతటవే సాక్షాత్కరిస్తాయి.... ..
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment