చిత్ర కవిత 17
శీర్షిక : ఉగాది
తేది: 12-04-2021
కవిత సంఖ్య : 638
ప్రకృతితో మమేకమైన మానవాళి
ప్రతిక్షణం పల్లవించే పసందైన మార్పుల
అనుపానుల అనుకూలతలను పసిగట్టి...
పాటించడమే పండగలు పబ్బాలు హైందవాన ....
శిశిరంలో తలలు దులుపుకుని
వసంతంలో సింగారించుకున్న
తరులు...
నూతన చివుళ్ళతో అతిథుల రాకకై
ఎదురుచూస్తుంటే ....
కొత్త చిగుళ్లు మెత్తుకున్న కోయిలమ్మలు
మత్తుగా ఎత్తుకున్న రాగాలాపనలతో
ఆమనికే హొయలు నింపి...సందళ్ళతో
అందాలను చిలకరించి ఒలకబోస్తుంది ....
కాలమహిమలను పసిగట్టిన మనం
రాబోవు గ్రీష్మ తాపాలను రస రమ్యంగా
ఎదుర్కొన ...
చెనుకులీనే చెరుకు గడల బెల్లపు తీపిని,
చింత పులుపును, వేపపువ్వు చేదును,
వయ్యారాల మామిడి ఒగరును, ఉప్పు కారాల
షడ్రుచుల..ఉగాది పచ్చడే దివ్యమైన ఔషదంగా ...
స్వీకరించె...
ప్రకృతిని పట్టినా ముట్టినా
పబ్బతి పట్టే సాంప్రదాయం...
కలశపూజలతో ఆరంభించి
కాలాన్ని విశేషంగా పూజించి...
గమనాలను పంచాంగ శ్రవణం
గావించేదే "ఉగాది " తెలుగు లోగిళ్ళలో......
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment