ధనమూలమిదమ్
తేది : -15-04-2021
శీర్షిక : డబ్బు జబ్బు...
కవిత సంఖ్య : 640
అనుబంధాల మల్లె పందిరి
గ్రీష్మ తాపాలకు చెల్లా చెదురౌతున్నది
మనిషి కనిపెట్టిన మౌన మాంత్రికుడైన
రూపాయేమో కనికట్టు చేసి కబాడీ ఆడేస్తున్నది....
మనిషికైనా దేశాలకైనా
మసలాడానికి ఇంధనం
ధనమే అయినా మానవతా
వాదానికన్నా గొప్పదేమీ కాదు .....
విశ్వమంతా విస్తరించిన
కలిమాయల ప్రభావమైనా ...
కాలుష్య రక్కసి కోరల విష
వాయువుల వలన కేకలైనా....
చరిత పరికిస్తే చకితమే సుమా
వలస కార్మికులు వట్టి పోయిన
విధానం... నట్టేట ముంచిన
నాయకుల నడకల తీరు......
విరామమెరుగని భూమిలా
లోకమంతా డబ్బుచుట్టే...
వరుసగట్టి వార్తల్లో నిలిచిన
డబ్బు జబ్బుల వైద్యలయాల
ప్రవర్తనలు...
ధనం తలుచుకుంటే కొన్ని
కొంతవరకే చేయ గలుగుతుంది...
మనిషి రూపాన ఉన్న దైవమే
కష్టాల కడగండ్లు దాటించవల్సింది
సోనూసూదులా.....
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment