కాగితం పడవ
తేది: 26-04-2021
శీర్షిక: మధ్య తరగతి రంగుల కల
కవిత సంఖ్య : 649
పారిశ్రామీకీకరణలకు పట్నాలు
పది అడుగులేస్తే ....
సాంకేతికతల పడగలనీడల్లో
ఏకంగా పరుగు లంఘించుకున్న
జాడలేనాయే ....
స్వార్థ పూరిత కలుషిత నీడల
నాయకుల మాటలో ....
ముందుచూపులు కరువైన
అధికారుల జాడ్యపు జాడలో ....
అడ్డగోలు శిఖం భూముల
కబ్జాల దళారీల మాయలో ...
వెరసి మధ్య తరగతి రంగుల కల
స్వప్న ప్రపంచపు స్వంత గృహాలుగ
నెరవేరుతున్న కలలు .....
చినుకు పడితే వణుకే గతి
వరద ప్రవాహాలకు సర్వం హారతి
ఇంట్లోని వస్తువులే కాదు
గొడ్డు గోదా అన్నీ సమర్పించుకుని
చివరకు ఇల్లులు కూడా
కాగితప్పడవలై వరద నీటిలో
శివార్పణo అయిపోయి
నిరాశ్రయులవ్వడం జరుగుతుంది.....
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment