నేనున్నాననే భరోసా
తేది : 10-11-2021
శీర్షిక : బలవర్ధిని లేపనం
కవిత సంఖ్య : 69+4
పూట పూటకు టంచనుగా
అలారం పెట్టుకుని అరిచి గీపెట్టే
కోట్ల జనాభాల పేగుల అరుపులకు ...
రక్తం స్వేదంగా రంగరించైనా సరే...
కష్టానికి తగిన ప్రతిఫలాలు పొందకున్నా
కాకి లెక్కల గోలలతో పాలకులు
ప్రతిపక్షాలు వారి ఉసురు పోసుకుంటూ
మద్దతులు మరిచిపోయినా సరే ....
ఆరడీలన్నీ అణగదొక్కుకుని
ఆకళ్ళు తీర్చంగా ముందు వరసలో
నేనున్నానంటూ హాలికుని భరోసాలే....
ఆత్మ నిబ్బరాలు దేశంలో ఈనాడు ....
పాప పుణ్యాల చింతన లేని నాయకులు
కొంతమంది ... పరాచికాలాటలతో
నాణ్యత కొరవడిన పరికరాలందించి
వారి ప్రాణాలనే ఫణంగా పెట్టినా సరే .....
పొరుగు దుర్మార్గాలను చీల్చి చెండాడుతూ
ఎప్పటికప్పుడు కోట్ల మంది దేశప్రజలకు
నేనున్నానే భరోసాలు కల్పిస్తూ సైనికుల
శ్వాసలే ... సరిహద్దుల సందెపొద్దులై నిలిచె ....
అయినను ... మానవత్వం మరిచిన
ధవళవస్త్రదారులెందుకో... ఒక్కసారైనా
నేనున్నాననే భరోసాల బలవర్ధినై
లేపనాలు పూయరెందుకో ... కొంతమంది....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment