Friday, November 5, 2021

తెలిస్తే ఏం చెయ్యగలం ?! తేది : 18-10-2021 శీర్షిక : ఉడతాభక్తిగా .....

 తెలిస్తే ఏం చెయ్యగలం ?!

తేది : 18-10-2021
శీర్షిక :  ఉడతాభక్తిగా ..... 
కవిత సంఖ్య : 179

రాజుల రోజులు పోయి  
రాజ్యాలు మారినప్పటికీ 
రాజకీయం రణతంత్రం 
రాజుకుంటూనే ఉన్నది 

దెబ్బ దేండ్ల స్వాతంత్రంలో 
అవలోకనం అయ్యింది ఒక్కటే 
పేదోడి పేరు చెప్పి పెత్తనాన్ని 
మాత్రమే  పంచుకుంటున్నారు 

రెక్కాడితే కాని డొక్కాడని 
పేదోడి బతుకు చిత్రం మారలేదు 
రాళ్ళు రప్పలు మోసే 
కూలోడి తలరాత మారలేదు 

కాలానుగుణంగా పక్షులు 
ప్రదేశాలు మారినట్టు 
కండువాలు మార్చుకుని పార్టీలు 
మారుతున్నరు మన నాయకులు .... 

పదవుల పంపకాలలో 
పరవశించి పోతున్నారు 
హీనాతి  హీనముగా ప్రవర్తిస్తూ 
కంపరం పుట్టిస్తున్నారు . 

ప్రజా ధనాన్నిలజ్జవీడి పసిగట్టి 
పదిలపరచు కుంటున్నారు కొంతమంది .... 
పచ్చి బజారు మనుషుల్లా నాయకులు , 
అధికారులు ,బడా వ్యాపారులు . 

మనిషి "మనీ"షి  గా మారి  సాటి 
మనిషిని దోచుకుంటున్నాడు 
మనిషన్నవాడు మాయమై  
విష జ్వాలలను విరజిమ్ముతున్నాడు.  

"మనీ"షి-మనిషిగా  మారకుంటే  
మన మనుగడే మృగ్యమౌను 
"మనీ"షి- మృగమై సంచరించక 
ముందే మనమంతా మేల్కొనాలి... 
మేల్కొల్పాలి .... 

అక్షరాస్యత అభివృద్ధి జరిగితే 
అంతమౌను కొంతైనా ఈ  దోపిడీ... 
సహాయ శక్తుల ప్రయత్నిస్తున్నారు 
విద్య ... వైద్యం  అందకుండా అందరికి .... 
 
సంఘ హితం కోరే సంస్కర్తలంతా- 
ప్రశ్నిస్తూనే ఉండాలి ప్రభుత్వాలను... 
 పదిల పరచడానికి ప్రజాతంత్ర 
ప్రజా స్వామ్యాలను ప్రజా క్షేమాలను 
పదికాలాలు పటుతరముగా ..... 
ఊరుకోకుండా ... ఉడతాభక్తిగా.....  

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment