Wednesday, November 10, 2021

హరిత స్వప్నం-1 తేది: 21-10-2021 శీర్షిక : జనం కలిసి నడవాలి ....

 హరిత స్వప్నం

తేది: 21-10-2021
శీర్షిక : జనం కలిసి నడవాలి .... 
కవిత సంఖ్య : 780

విశ్వంలో వింతరీతిన మరకతమై 
శోభించిన గ్రహం భూమి అన్నది నిజం  ...... 
జీవకోటికి ప్రాణాధారమై నిలిచిన 
ఆమ్లజని ఉదజనిల పుష్కలావరణపు 
భరణం .... 

జీవకోటిలో మిన్నంటూ విర్రవీగే 
మనిషి సంకుచితాలకు బానిసలై 
స్వార్థాల చేతులు పనిగట్టుకుని 
వనాలను నరుక్కుంటూ పోతే .... 

చతికిలబడ్డవనుకున్న వనదేవతలు 
తిరగబడి చేసిన బడితెపూజలా 
గ్రీష్మ తాపాలను పెంచి పోషిస్తూ 
చితులు పేర్చుతున్నది జీవరాశికి .... 

బుడ్జెటుల బాగోతాలతో ...ప్రణాళికల 
పరాచికాలతో ....కలల ప్రపంచములో 
కదలాడగనే...కాకలు తీరిన కార్యాచరణల 
అమలు లేనిదే కోరికలు తీరి ముక్తి లభిస్తుందా ....? 

రెడ్డిగారొచ్చే.... మొదలెట్టండి లాగ 
రక్షణల విచక్షణలు కోల్పోయి.... మొక్కలు 
నాటిన చోటులలోనే ... మళ్ళీ  మళ్ళీ నాటుతూ 
గాలివానలకు గరికలు కూడా మొలవని 
చెట్ల నీడలలోనే....తచ్చాడుతూ మొక్కలు నాటితే ... 
స్వప్నాలన్నీ హాస్యప్రియమేనన్న రుజువులాయె ..

నాయకులు మాత్రమే  స్వప్నించి నడిస్తే 
నాలుగొద్దుల  ముచ్చటై నిలుస్తుంది .... 
అవగాహనలు ఆవాహనపరిచిన జనమంతా 
కలిసి నడిస్తేనే జంగలంతా వృక్షాలై నాలుగు
 దిక్కుల ఫరిఢవిల్లు ... 

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment