నా ప్రియమైన నేస్తాలు
తేది : 12-10-2021
శీర్షిక : ప్రకృతి
కవిత సంఖ్య : 54+6
పంచడమే తెలిసిన ప్రకృతిలోని
ప్రతి అణువణువు కట్టిపడేస్తుంది ....
కువకువలతో నిద్రలేపే పక్షులు
వెలుగుపూలు పంచే భాస్కరుడు
వెండిమబ్బులతో ప్రాణాధారమైన
పంటలకు ప్రాణం నిలిపే వర్షం ...
చుక్కల నింగిలో ఒక్కడై నిలిచిన
చక్కని రాజు ... వెండి పూల వెన్నెలలు
పంచుతూ ... చల్లదనాలను వెదజల్లి
చక్కిలిగింతలు పెట్టే చందమామ ....
కాల మాన పరిస్థితులలో కఠినాలను
ఎదుర్కొంటూ ... సతత పత్ర హరితాలను
మూటగట్టుకుంటూ .... ప్రాణవాయువులు
అందిస్తూ .... నిలిచే వర్షాధార తరువులు .....
కఠినాత్ములైన మనుషులు
కల్మషాలను కాలుష్యాలను
వెదజల్లుతున్న .... కరుణ గల్ల
నదీమతల్లుల నేటికీ తాగునీరు
సాగునీరిస్తున్న తీరు ....
నోరు లేకున్నా మాట రాకున్నా
పల్లె పట్టున పచ్చికలు మేసి
పాలిచ్చి ప్రజలను కంటికి
రెప్పలా కాచుకుంటున్న పశు
జాతులను చూసినప్పుడల్లా
ఉప్పుంగిపోయే నా మనసుకు
నచ్చిన నా ప్రియ నేస్తాలు .....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment