దేశ భక్తి గేయం
తేది: 02-10-2021
శీర్షిక : శతాబ్ది నాయకుడాయె...
కవిత సంఖ్య : 768….
ఏ మత సారమైనా
మానవాళి క్షేమమని…
శంఖమూది బోధించే
శరణంటూ బాపూజీ … //మతాల//
కులమంటూ రెచ్చగొట్టి
మతమంటూ విడగొట్టి
ముక్క చేసే భారతాన్ని
అక్కసుతో తెల్లవాడు.... //మతాల//
కర్ర చేత పట్టుకున్నా
కొల్లాయిని కట్టుకున్నా
కోట్లాది భారతీయుల
మనసు కొల్లగొట్టాడు .... //మతాల//
సత్యమే శక్తివంతమని
తపనపడ్డ తపోధనుడు
అహింసనే ఆయుధంగ
సంధించే తెల్లోనిపై ..... //మతాల//
అతివాదం చేటని
మితవాదం మేలని
అనుసరించి చూపాడు
ఆచరించి గెలిచాడు. //మతాల//
దేశగతిని మార్చాడు
దశ దిశల వెలిగాడు
శత విధాల గెలిచి తాను
శతాబ్ది నాయకుడాయె... //మతాల//
అన్ని మతాల సారం
అహింసా వాదమేనని
అనుసరించు సోదరా
ఆచరించు వేగమే…. //మతాల//
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment