చిత్ర కవిత
22-10-2021
శీర్షిక : పర్ణశాల వాకిలి
కవిత సంఖ్య : 54+12
మట్టి గోడలు కట్టె గుంజలతో
కాశ గడ్డి కప్పుకున్న చల్లని తల్లి
కమ్మని అనుభూతుల నీడలనీయగా ...
కలిసి బతుకులే కద ఆలుమగలకు
కడదాకా తోడూ నీడలై మనసులు నింపు ......
సక్కని బతుకులకు రెక్కల కష్టమేనని
నమ్ముకున్నోళ్లు...సరదాల పందిరిలో
కలో గంజో కలిసి తాగాలనే కోరికలతో
చెరొక చేయి వేసి పనులు చక్కబెట్టుకోగా ....
కష్టసుఖాలలో కలిసి అడుగులేయడమే
కాకుండా ... నిత్యవారీ పనుల్లో కూడా
నిజాయితీగా పంచుకున్నారు ఒకరికొకరు
చిన్న చిన్న పనులు చిత్రమైన రీతిగా ...
దండి దంపతుల చేత పట్టుకున్న
బియ్యం... పప్పు ఉప్పులో సైతం
కంట పడ్డ మట్టిపెల్లనో ... రాయినో
కదిలించ ...శుభ్రతల చాటలు పట్టుకునే ....
మెడలు రిక్కించి ఒడలు జలదరించ
ఆశగా చూస్తున్న కుక్కుటము
ఆకలి దప్పులు సైతం తీర్చగలిగే
మహానుభావుల పర్ణశాల వాకిలది....
మూల మూలలా ఇల్లూడ్చి కళ్ళాపి
పెట్టంగానే ... అలిసిన మేనుతో
ఇల్లెక్కి విశ్రాంతి తీసుకుంటున్న
శుచి శుభ్రతల సుందర ప్రతినిధులు
ఇరువైపులా దర్శనమీయుచుండె .....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment