చిత్ర కవిత
తేది : 10-09-2022
శీర్షిక : చెళ్ళపిళ్ళ గారి శిష్యుడు
కవిత సంఖ్య : 167+4
తల్లి పార్వతమ్మగారు
తండ్రి శోభనాద్రి గారు
నందమూరు ముద్దుబిడ్డ
తనయుడాయే విశ్వనాథుడు...
గురువు చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి గారితో
అల్లిబిల్లిగా అల్లుకున్న బంధమే ...
చూసినదెల్ల సుఖమయమైన
కవిత్వమై సుందరముగ వెలుగులీనే ....
ఎరుగని ప్రక్రియ లేదు
వ్రాయని విధానము లేదు
వరసపెట్టి రచించాడు... వాలుగా
కవితలు,కావ్యాలు, కథలు,
నవలలు, నాటకలు, పద్యాలు ,
వ్యాసాలు, చరిత్రలు, ప్రయోగాలు,
విమర్శలు, ఎన్నో ... ఎన్నెన్నో ....
విశ్వేశ్వర శతకంతో ఆరంభించి
వందల రచనలతో వర్దిల్లినారు
పద్మభూషణమై విరాజిల్లినారు
జ్ఞాన పీఠమెక్కె మనకు గర్వకారణమై
తపాలా బిళ్ళ సైతం విడుదలాయే ....
అనువదించిరి పి వి గారు
సహస్ర ఫన్ పేరున
వారి వేయిపడగలను
సత్కార్యముగ భావించి ....
అదృష్టమంటే నాదే కదా
వారు నడిచిన అడుగుల
గురుతుల నడకలలో.....
ఎస్ ఆర్ ఆర్ కాలేజీ
కరీంనగర్ లో....తదుపరి
కాలాన చదువుకోవడం....
ఈ జీవితానికి ..
శతకోటి వందనాలు
విశ్వనాథుల వారికి ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment