కాళోజి
తేది: 09-09-22
శీర్షిక: ప్రజా పక్షపాతి
కవిత సంఖ్య : 167+3
అక్షరాల మాంత్రీకుడతడు
లక్ష్యము గల సాహితీ సేవకుడు
తెలంగాణా గుండె చప్పుళ్ళకు
విలక్షణమైన కవి పండితుడు.....
నిజాముల నిరంకుశాన్ని
నిక్కచ్చిగా నిగ్గదీసిన ధీశాలి
వలస పాలకుల పక్షపాతాలను
వడకట్టిన అక్షరాయుధుడు ....
అణా కథలతో ఆరంభించి
అన్యాయాలను ఎదిరించి
హింస.. రాజ్యహింస వద్దని
అహింసను అక్కున చేర్చుకున్న
' గొడవ ' కారి.
బడుగులతో నిండిన తెలంగాణ
బడా బాబుల కేంద్రమయ్యిందని
తెలంగాణ ‘యాస’ ‘భాష’
తెల్లారిపోకూడదని అల్లాడి..చరిత్ర
తిరగరాయండని తెగేసి చెప్పిన ప్రజాకవి...
తెలుగు హిందీ కన్నడ మరాఠీ
ఉర్దూ ఇంగ్లీష్....భాష ఏదైనా
భావ తీవ్రత ప్రస్ఫుటం చేసి
సామాన్యుడే నా దేవుడన్న సహనశీలి...
పుట్టుక చావు లొదలి
పుడమి మీద జీవితమంత
సంఘానికేనని పార్థీవ దేహాన్ని
వైద్య కళాశాలకు సమర్పించుకున్న
ధన్యజీవి ....
ప్రజల తిప్పళ్లను ప్రతిబింబించి
పాలకులకు ఎదురు నిలిచి
మానవతను నెత్తికెత్తుకున్న
మహనీయుడు ... ప్రజాకవి…
ఆణిముత్యాలైన మాండలికాలు
అపూర్వమైన వారి రచనలు
పాఠ్యముషాలైనవి పట్టాలకు
డాక్టరేట్లకు దారి చూపించాయి ...
రైతు సాగు చేసినట్టు
రాజు బాగా ఏలాలంటే
రామరాజ్యమై విలసిల్లాలంటే
పరిణతులతో ప్రశ్నించే
ప్రజా పక్షపాతి కాళోజి లాంటోళ్ళు
కాముక కావాలి….
No comments:
Post a Comment