ప్రత్యేక కవిత
తేది: 28-06-2021
శీర్షిక: మట్టి మనిషి
కవిత సంఖ్య : 139
కనుముక్కు తీరుతో కళ్ళకు కట్టి
కరుణా రసమ్మును కళ్ళలో ఒలికించి
కారుణ్య మూర్తిగా కళనంతా వంపి
కట్టిపడేసెనా మనను కణికట్టుగా .... శిల్పి
అనుభవాలు ఉట్టిపడుతున్న
ఆలోచనల అంతరంగం
అనంతమైన మేథో మధనంతో
విచారమయమైన వదనం .....
మట్టిముద్దలకు ప్రాణంపోసే
విధాతకు ధీటుగా మెరుగులద్ది
పాప బొమ్మకు రూపమిచ్చిన శిల్పి
నైపుణ్యము అనన్యం అమేయం .....
కరోనా కాలపు చదువులకా ?
సంఘంలో సన్నుతించే వివక్షలకా ?
ఆగమ్యగోచరమౌతున్న ఆలి బతుకులకా ?
బాదర బందీ లేని భావిజీవితానికా ?
ప్రశ్నేదైనా .... పరికించవల్సిన విషయమే....
ప్రజా జీవితంలో ప్రమదకు దక్కుతున్న
ఫలితాలే ...ప్రశ్నలై వేధిస్తుం డెనా పాపకు ....
ప్రతివారు ప్రశ్నిచుకోవాలంటూ ....
మృణ్మయ మౌని వ్రతం ......
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment