Saturday, August 14, 2021

చిత్ర కవిత తేది :21-06-2021

 చిత్ర కవిత

తేది :21-06-2021
శీర్షిక : తరువే జీవరాశి పరువు సుమా ....
కవిత సంఖ్య : 692

పంచభూతాల పరిమళాలే కద
పావనమైన జీవరాశి అస్థిత్వం
ప్రకృతమ్మ వితరణలే కదా సదా
ప్రతిజీవికి పోషణలు అనుక్షణం ....

ఆచారాలను  అలా అటకెక్కించి
సంప్రదాయాలను సద్దుమణిగించి
అభివృద్దే ఆటబొమ్మలుగా పెచ్చరిల్లి
అర్రులు చాచిన  నవీన మానవునికి...

పచ్చదనం పాలిపోయి పలుచనై
శ్వాసలాడక సన్నగిల్లి పోతేగాని
కాలుష్యాల కబంధ హస్తాల్లోకి
కమతమైన భూమాత కానరాలేదు ....

ధరణమ్మకు  జరిగిన నష్టం బేరీజు వేస్తే
దండిగ ఒంటి చేత ఒరిగే దేమి లేదని
జంటగ రెండు చేసి జోడించి ఉన్నవి
రక్షించాలని పట్టుదలగ కదిలినా
పూరని నష్టాన్ని తలచి వగచిన మనిషి  ......

తప్పక చేదోడు వాదోడుగా తన పక్కవారి
సాయమక్కరని...  కొత్త మొక్కలు నాట
కనువిప్పులు కలిగిన నిప్పు లాంటి
నిజమును ఒప్పుక కదిలిన వేళ ....

నయన మనోహరమాయె చూడు
నలు చెరగుల మరకతమై శోభిస్తూ
నేడు నవ హరిత హారములతోడ
యథా రాజా తథా ప్రజలై చింతలు దీర్చ .....

కాముక కదిలిన మనమంతా
కట్టుబాటుగా ఒక్కటై నిలిచినచో
కనుమరుగౌ కాలుష్యాలు మున్ముందు ...
తరువే జీవరాశి పరువు సుమా ....

నగునూరి రాజన్న
కరినగరము

No comments:

Post a Comment