Saturday, August 14, 2021

చిత్రకవిత 18-06-2021

 18-06-2021

శీర్షిక : సతీ అనసూయ 
కవిత సంఖ్య : 32

అసూయ అంటుకోని తల్లి
ఆ సాధ్వీ మణిని  పరీక్షించ
పయనమైరి త్రిమూర్తులు
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు....

కోరిన కోరిక..  కాదనలేక కొంగ బంగారై
కోరి వారిని... ప్రణమిల్లి పసిపాపాలుగ చేసి
అడిగిన వరమిచ్చి  అమ్మగ అవతరించె 
త్రిమూర్తులకే  అనసూయ అద్వితీయమై ...

అపురూపమైన ఆ దృశ్యం కనినంతనే 
పరుగు పరుగున కదిలిరి ముగ్గురమ్మలు  
పతులనిమ్మని వేడిరి సతి అనసూయను 
పతివ్రతా శిరోమణిని కరుణించి కాపాడమంటూ ..... 

ముమ్మూర్తులా ముగ్గురమ్మలనే 
ముద్దు కోడండ్లుగా తీర్చి దిద్దుకునె 
సతీ అనసూయ సహనముతో 
సంతసించె నంత దేవతలంతా..... 

సృష్టి స్థితి లయకారకులైన
ముల్లోకాలను ఏలే  త్రిమూర్తులే 
మురిపమైన బాలకులైతే ఇక 
అల్లకల్లోలమే నన్న ప్రార్థనలకు .... 

కరుణించి కాపాడె సాధ్వీమణి 
యధారూపాలను వారికిచ్చి 
దత్తుణ్ణి వరపుత్రుడుగా  కోరి 
ధన్యవతిగా నిలిచె చరిత్రలో...... 

నగునూరి రాజన్న
కరినగరము

No comments:

Post a Comment