గుర్తుకొస్తున్నవేళ
తేది : 21-05-2021
శీర్షిక: మొదటి ఫోటో
కవిత సంఖ్య: 668
మరిచిపోలేని సంఘటనలు ప్రతీది
మరుపురాని మనోగీతికలు ఒక్కొక్కటి
మధురమైన అనుభూతులు ప్రత్యేకం
మాదిగూటిలోన శాశ్వతంగ నిక్షిప్తం ....
పల్లె పట్టున ఆఖరిమెట్టు
పదవ తరగతి చదువనగానే
సోపతోళ్లతో చిలిపి తమాషాలు
పట్టలేని నిత్య సంతోషాలు..తదుపరి
పట్నమెల్తామనే ఆనందాలు ....
మూణ్ణెల్ల ముందునుంచే మురిపాల
తయారీలు..పబ్లిక్ పరీక్షల తంతులు
అప్లికేషన్ల హడావుళ్ళు నలుపు తెలుపుల
ఫోటోలు కాముక కావాలని ఆజ్ఞల జారీలు ....
ఒక్కసారిగా బిక్కుమన్న మొఖాలు
కొత్తగ గజిబిజిల పట్నం పోవుడా
చారాణా కోడికి బారాణా మసాలా లా
అందరి అమ్మానాన్నలు అదే తంతు ...
అప్పుడు గద మా సార్లు కనికరించి
ముఖ్యoగా మా పి టి మాస్టారు ధర్మారెడ్డి
పట్టుబట్టి పిలిపించె ఎం ఎం ఖానుగారిని
వరుసబెట్టి తీయించె ఫోటోలు అందరికి....
మొట్టమొదటి ఫొటో కోసం పడరాని
పాట్లతో..పదిహేను రోజుల ఫీట్ల తర్వాత
మూడున్నర రూపాయలకు మూడు
ఫొటోలిచ్చి ... మా బాధలన్ని తీర్చే....
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment