అంశం: కెరటం నా ఆదర్శం
తేది : 17-04-2019
శీర్షిక: నా జీవితమే సాక్ష్యం ....
సంఖ్య : 161
పంతొమ్మిది వందల అరవై తొమ్మిది
స్వార్థ రాజకీయాలకు తెర లేసింది
పంతాలకు ఆలవాలమయ్యింది
స్వంత తెలంగాణాకు సై అన్నది....
సందట్లో సడేమియా లాగ
సదువు బడుల మీద ప్రతాపం చూపింది
సదువుల కొంపలు ముంచింది
చదువలేక ఫరార్ చానా మంది.
పదివరకు పల్లె చదువులే....
పట్టుతోనే చదివామందరం.
పై చదువులకని పట్నమొచ్చి
పట్టు తప్పి ప్రవర్థించాం...
ఇంటర్ రెండేళ్లు ఇరకాటమే.
అమ్మ నాన్నల కష్టం చదవమన్నా ...
స్వార్థ రాజకీయ కుట్రలు నిలువనీయలేదు
మమ అనిపించి ఊపిరి పీల్చుకున్నాము .
కానీ ....
ఉన్నత విద్య మొదటి సంవత్సరాంతాన
ఉద్దండుడని పేరు మోసిన
ఉపకులపతి శ్రీ జగన్మోహన్ రెడ్డిగారు...
ఉన్నఫళంగా పరుగెత్తించారు ....
మూడు సంవత్సరాలకు కాదు
సంవత్సరం వారీగా పరీక్షలంటూ.....
అటకెక్కించిన చదువులన్నింటిని
ఆధారంగా భావించి......
అందుకున్నాం .... చదువులు
పడి లేచిన కెరటంగా పయనించాము....
పట్టా పుచ్ఛుకుని జీవితాన్నే దిద్దుకున్నాము ...
నగునూరి రాజన్న
కరీంనగర్ (ప్రస్తుతం రిచ్మండ్)
No comments:
Post a Comment