Saturday, April 27, 2019

మనసులోని మాట

అంశం - మనసులోని మాట 
తేదీ 20-04-2019
శీర్షిక - యథా రాజా తథా ప్రజ. 
సంఖ్య -164

మనసులోని మాట 
మంచి చెడుల మూట... 
షడ్రుచుల బాట.... 
మనకు మంచి అనిపించిందే వల్లె వేస్తాం.
 
కొన్ని సార్లు అవలోకించుకుంటే 
స్వార్థం సరంగైతే...  
మనకు మంచి ఎదుటివారికి చెడు....  
ఎదుటివారికి మంచి మనకు చెడు.....  

నిస్వార్ధం తోడు నీడైతే ... 
నలుగురు మెచ్చే బాట నడుచు 
నాలుగు కాలాలు పేరు నిలుచు 

మనిషి స్థాయి మారితే 
మసలుకునే తీరు మారాలి... 
బాల్యం బంతులాట 
బతుకు తీరులో మారాలి.... 

అందరి మంచిని ఆదరించినవాడే...  
ఆ జగదభి రాముడు,సుగుణాభి రాముడు 
యుగాలు మారిన ఉదాహరిస్తూనే ఉన్నాం. 

ఎప్పటికైనా మన నాయకులకు 
ఒంట బడితే .... మన కంటి వెలుగులౌతారు . 
ప్రజలంతా సుఖశాంతులు ఫరిడవిల్లి 
సుభిక్షాల వర్ధిల్లారా..... 

నగునూరి రాజన్న 
కరీంనగర్ (ప్రస్తుతం :రిచ్మండ్ )        

No comments:

Post a Comment