అంశం : ప్రతిభకు పట్టాభిషేకం
28 -01 -2019
శీర్షిక :స్థితప్రజ్ఞతకు పట్టం
సంఖ్య: 132
పర తమ బేధాలు పక్కన పెట్టు
కులమతాల పిచ్చి చిచ్చుపెట్టు
అర్హతలు ప్రావీణ్యత ఒడిసిపట్టు
అన్నీ ఉన్నవారికే కట్టబెట్టు
జాతి వివక్ష పనిపట్టు
జనాదరణ పసిగట్టు
జననాయకుణ్ణి నిలబెట్టు
జగతి గగనాన ఎగిరేట్టు
కార్మికుడైనా కర్షకుడైనా
క్రమశిక్షణల సైనికుడైనా
సమున్నత దేశ ప్రగతి
సంస్మరణ మంత్రం కావాలి
ప్రతిభ వలసలు నిరోదిద్దాం
జాతి జవసత్వాలు నిలబెడుదాం
సత్పలితాలు రాబడుదాం
విశ్వ విజేతగా గెలిచేద్దాం
ప్రజలంటే ప్రాణం పెట్టే
దేశమంటే పిచ్చి ప్రేమను చూపెట్టే
పొరుగును చూసి ప్రేమించే
చెడును ద్వేషించే
మంచిని గుర్తించి
మమతకు కట్టుబడే
అవసరాన ధైర్యం ప్రదర్శించే
సమస్త సద్గుణాల
స్థితప్రజ్ఞతకు పట్టం కట్టు....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment