Saturday, April 27, 2019

గ్రీష్మ జ్వాలలు

అంశం- గ్రీష్మ జ్వాలలు 
తేదీ 12-04-2019
శీర్షిక : కాలచక్రం 
సంఖ్య :157
ఎండ తోనే పత్ర హరితం 
ఎండ తోనే జీవ కోటి 
ఎండ తోనే నిండు మేఘం 
నిండిన మేఘం వర్షిస్తేనే 
పండును పాడి పంటలు .... 

స్వార్థం తెలియని ప్రకృతి సంపద 
గిరులు, తరులు, నదీమ తల్లులు....   
స్వార్థ పరుడైన మానవ  నీడన సాగిలపడుతున్న 
సవాలక్ష సవాళ్ల ప్రకృతి వనరులతో   
ప్రశ్నార్థకమౌతున్నది..... మానవాళి మనుగడకే ...  

ఆశా వాదులైనా నిరాశా వాదులైనా 
అనుభవించాల్సిందే ఫలితం..... 
అవసరానికి మించి వాడుతున్న 
అవని ప్రకృతి వనరుల వినియోగం ..... 

అన్నింటికన్నా అపారం  
పంచభూతముల ప్రాశస్త్యం....  
ఆర్యులెన్నడో  గుర్తించి 
ఆచరించి చూపారు..... 

వ్యక్తులైనా వ్యవస్థలైనా 
హేతువాదైనా నీతిబోధకుడైనా 
తెలిసి చేసినా  తెలియక చేసినా...
చేస్తున్న ప్రతి తప్పిదానికి 
చెల్లించక తప్పదు భారీ మూల్యం.... 

పచ్చని వనాలు 
పంచును చల్లదనాలు .... 
పరిరక్షిస్తే పర్యావరణం 
పరిమితమౌ గ్రీష్మ జ్వాలలు 

నగునూరి రాజన్న 
కరీంనగర్ (ప్రస్తుతం రిచమండ్)

No comments:

Post a Comment