31-01-2022
అంశం : శిలాక్షరాలు
శీర్షిక : శాసనాలు
కవిత సంఖ్య : 835
ఆటవికతల కీకారణ్యాలు దాటుకుని
నాగరికతల నీడలలో.. నువ్వు నేను
నడిచొచ్చిన అడుగుల సవ్వడులు ...
చరిత్రలు వంపిన తీపి గురుతులు….
పురాతత్వశాఖలోనున్న పుణ్యమూర్తులు…
వీరత్వాల గుర్తుగా పాలకులు
విజయాల హద్దుల రేఖలను
విస్తరింప చేసుకుంటూ అక్కడక్కడ
విత్తుకుంటూ..అవధులేర్పరుచుకున్ న
లోహ లేదా శిలా లేఖనాలు...
కాగితాల కవాతులు లేని రేజుల్లో…
భాషా పండితులో ...బాగా ఏలిన రాజులో
బండలమీద రాయించిన రాతలతో
బలవంతముగానో..భక్తితోనో ప్రజాక్షేత్రంలో
పాటింపచేసిన ప్రవర్తనల నియమావళులు...
అక్షరాస్యులను నిరక్షరాస్యులను
ప్రజలందరినీ ఒక్కతాటిపై నిలిపి...
హక్కులను బోధించి..బాధ్యతల
బందీలను చేసి... క్రమశిక్షణలను
కంటి సైగల్లో నడిపించిన మంత్రం ...
మారిన రోజుల్లో..మారని పాలనా
పద్దతులతో... అప్పుడప్పుడు
బలవంతపు శాసనాలు చేస్తూ
ప్రజాగ్రహాలకు గురౌతూ… స్వయంపతనాలను
కొనితెచ్చుకుంటున్న పాలకులెంతోమంది ...
నేటి రోజుల్లో….
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment