వాసంతపు సవ్వడి
తేది :19-01-2022
శీర్షిక : వసంతం
కవిత సంఖ్య : 826
శశిరం చేతులు దులుపుకుని పోతే
వసంతం వచ్చి వాటేసుకుంది...
మోడువారిన మొక్కలన్నిటినీ తట్టి లేపి
లేలేత కొత్త కొత్త ఎరుపు చిగుర్లతో
పలకరించి కోలాహలమే చేసేస్తున్నాయి .....
చెట్లనావరించిన పిట్టలన్నీ గూళ్ళు
వదిలి చెట్లపై కువకువల సయ్యాటలతో
నిండు వసంతానికి ఆహ్వానం పలుకుతూ
ప్రకృతి మాతకు పద హారతి పడుతున్నాయి ...
వర్ణరంజితమై అల్లుకునే మేఘాల్ లోంచి
సుప్రభాత సుందరుడైన భానుని రాక
పక్షుల కిలకిలా రవపు పలకరింపులు
సుందర సుమధుర మనోహర దృశ్యాలు ...
సమశీతోష్ణ స్థితులతో జీవరాశులన్నీ
సరాగాలు వల్లించే సంబరం ....
పంటలన్నీ ఇంట చేరి గొడ్డు గోదా
ప్రశాంతతలతో...పల్లెలన్నీ సల్లగుండ ....
హిమ సౌధములన్నీ కరిగి కరిగి
నదీనదములలో కలిసి ప్రవహించగా ...
సుమగంధ పరిమళాలను మోసుకొచ్చే
పవనవీచికలు పయనించే సురభి సమయం ....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment