జానపద గేయం
తేది: 22-01-2022
శీర్షిక : పల్లె తల్లి ....
కవిత సంఖ్య : 828
పల్లె తల్లి పిలిచింది
పదరా ఓ సోదరా ....
ముల్లెమూట సర్దుకుని
కదలండి తొందరగా ....
ఒక్కసారి వెళ్లి వస్తే
ఒళ్ళంతా పులకరించు ....
అరమరికలు లేకుండా
ఆత్మీయ పిలుపులతో
ఊరంతా ప్రతివారికి
వరసైన బంధువులే ....
పక్కోళ్లను పలకరించే
చక్కనైన గుణముతో
మర్మాలను తొలిగించి
మనసులన్ని కడిగేసు…
పశుపక్ష్యాదుల పలకరింపు
ప్రాణాలను పట్టి నిలుపు
యాంత్రికత కొంతబాపి
ఆత్మీయత నింపుతుంది ....
కలుషితాల గొల్ల్యాలు
కడుదూరం పల్లెలకు
కళ్ళాపి వాసనలు
కమనీయపు ముగ్గులు ...
పచ్చపచ్చని పొలాలు
పరిమళాలు వెదజల్లు
పుష్కలంగ దొరికేను
ప్రాణవాయువధికంగా
ప్రాణాలను శుభ్రపరిచి
పదిలపరుచు నిబ్బరంగా
తనివితీర మనమంతా
పలకరించి వద్దామా .....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment