Saturday, June 11, 2022

దేశం తేది : 26-01-2022 శీర్షిక : సమైఖ్య భారతం

 దేశం 

తేది  : 26-01-2022
శీర్షిక : సమైఖ్య భారతం 
కవిత సంఖ్య : 207

దేశమంటే మనుషులోయన్నాడు 
మహాకవి మన జాతిరత్నం గురజాడ 
మతమేదైనా మనుషులంతా ఒక్కటేనన్న 
మన రాజ్యాంగం స్ఫురణై మెదలాలి ..... 

దేశమంటే ...మనిషి దశ ఎదగాలె ... 
భయాల నీడన బతుకులీడ్వడం కాదు ... 
మరుభూమిని తలపించే మానవ 
మారణహోమాలకు నాంది కారాదు..  

చేసిన తప్పులను చరిత్రలు  ఎప్పుడూ 
చెబుతూనే ఉంటాయి ... అందుకు 
సాక్ష్యం....అదిగో నేతాజీ ... ఇదిగో బహదూర్  .... 
అదే మన వేదాల అసలు సారం ..... 

కలిసి మెలిసి బతకమంటున్నయి 
పవిత్ర గ్రంథాలన్నీ మత సామరస్యంతో 
భగవద్గీతయినా... ఖురనైనా ... బైబిలయినా...
గురుగ్రంథ సాహిబయినా ..... కానీ  

స్వార్థాల నీడలలో  సమాజ సరంగులంతా 
ఊసరవెల్లులై .... రంగులు మార్చుతూ 
కార్చిచ్చులకు కదం కలుపుతున్నారు ... 
కాటికాపరులై నాటకాన్ని రక్తి కట్టిస్తున్నారు ... 

పాలకులెవలైతేనేం ... పారాహుషార్ 
ప్రజలారా ... కలిసికట్టుగా నిలుద్దాం ... 
శాశ్వత ప్రయోజనాలు ఫణంగా పెట్టి 
తాత్కాలిక తైలాలకు మొగ్గు చూపద్దు .... 

స్వాతంత్య్ర సమర వీరుల స్థైర్యమే 
కావాలి మనకు శ్వాస ప్రతి నిమిషం .... 
పూర్వీకుల పునాదులే నిలపాలి 
నిరంతరం ...ముదముగ మనమంతా ... 
ముందు తరానికి అందిద్దాం .... 

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment