మైదానం
తేది : 23-03-22
శీర్షిక : నాగరికత నడక
కవిత సంఖ్య : 238
ఆటవికతలకు స్వస్తి పలికి
నాగరికతలలో నడక నేర్చుకున్నాక
ఆకులలములు పండ్లు తిండి చాలక
పంట పొలములకై అడవులను నరికిన
వ్యవసాయ భూములే మైదానాలు ....
పిల్లల ఆట పాటలకు
అనువైన పెరుగుదలలకు
మానసిక వికాసాలకు ....
మనిషి ప్రశాంతతలకు
ఉపకరించేది ఈ మైదానం ....
న్యాయాన్యాయాలకు నడుమ
ధర్మ యుద్ధాలకు దారితీసిన
మహాభారత యుద్దానికి కూడా
మైదానాల అవసరం పడింది.
వాసికెక్కిన వార సంతలకు ....
జన సమ్మర్ధాల తీర్థాలకు
పవిత్రమైన ఉత్సవాలకు
పర్వదినములందు పదుగురు
కలుసుకునేందులకు అనువైనది
మైదానం ...
స్వార్థాలు సర్వ మానవాళిని
మింగేసాకా .... రాజకీయం
రచ్చకెక్కాక .... మైదానాలన్నీ
మాయమై కబ్జా కబంధాలలో
గిలగిలలాడుతున్నవి మైదానాలిప్పు డు ...
అభివృద్ధి చెందామనుకుంటున్న
అల్ప బుద్దుల పాలక గణాలు
ఇప్పటికైనా ఇబ్బందులు గుర్తించకపోతే ...
సాంతం కనుమరుగయ్యే సందర్భమే.
నగునూరి రాజన్న
No comments:
Post a Comment