కోటలో పాగా
తేది: 29-06-22
శీర్షిక: ఆధునికత…
కవిత సంఖ్య: 925
గుడ్డి గుడిసెలు గూనపెంకుల
ఇళ్లల్లో కరంటు దీపం వెలిగిన నాడు
కళ్ళల్లో కాంతులీనితే.... అంతులేని
ఆనందాలు మూటగట్టుకున్నామనుకున్న కానీ...
చేతివృత్తులు చెంగో బిల్లనుకోలేదు ...
వరసబెట్టి వ్యవసాయంలో
యాత్రికతలు పెరిగి...దుర్ దుర్
చప్పుళ్లకే దున్నుడై పోతోంటే
ఆనందపడ్డాను గాని ... అంబా
అరుపుల అదృశ్యమై పోతయనుకోలేదు సుమా...
సాలీ సాలని ఎవుసం దిగుబడులకు
ఉపాయంగ వచ్చిన జపాన్ ఎరువులతో
లాభమే లాభమనుకున్నా గాని... ఏకు
మేకైనట్టు చేరి... ఎర్రినాగన్నను జేసేసి
ఒళ్ళంతా కుళ్ళ బొడుస్తదనుకోలేదు...
వణిక్ ల చెంత నుండి చేజారి
వ్యాపారం విస్తరిస్తుంటే... వారెవ్వా
అగువతయనుకుంటే.. నీతి జాతి
తుంగలో తొక్కి...కారంలో రంపంపొడికి
కళ్ళు ఎరుపెక్కుతాయనుకోలేదు...
ప్రభుత్వానికి దీటుగా ప్రవేటు
దవాఖానలొస్తే... పది మంది
బాగుపడుతారనుకున్న గాని ...
నారాయుణిడి సమమైన ధవళ వస్త్రాలు
కూడా ధరలు పెంచి సామాన్యుని
నడ్డి విరుస్తుంటే....నరకం కల్లముందా యె…
అది ఇది అని తేడా లేకుండా
ఆధునికత అన్నింటా దూరిపోయి……
పొట్టలో పొట్టేలు గుద్దులతో పిప్పి పిప్పి
చేస్తుంటే… అలవాటు పడిన ప్రాణం…
అలితేరి పోతున్నది
నగునూరి రాజన్న
No comments:
Post a Comment