గురుపూర్ణిమ
తేది : 13-07-22
శీర్షిక : గురువు
కవిత సంఖ్య : 144+5
చరితలున్నంతవరకు
భవ్య భరతవర్షమునందు
పూజలందుకొను యోగ్యం
కలిగిన జ్ఞానద్రష్ట ....
సప్త చిరంజీవుల సరసన
నిలిచిన సయోగ్యుడు ...
వేదవేదాంగాలను విభజించి
మహాభారతం భాగవతాలను ....
అష్టాదశ పురాణాలను రచించి
భరతజాతి కీర్తి ప్రతిష్టలను
ఇనుమండింపజేసిన ఆధ్యాత్మిక
విశ్వ గురువు ....
ఋషులకు మునులకు
విజ్ఞులకు విజ్ఞానులకు
పూజనీయుడు ఆరాధ్యుడు...
పరమపూజ్యుడు వ్యాసుడు ....
తన రచనలలో తానే నిమిత్తమై
పాత్ర పోషణల కర్తవ్య నిర్వహణలు
చేస్తూ ... ఎప్పటికప్పుడు తనవారికి
నిర్వహించవలసిన కర్తవ్య బోధనలు
ఉపదేశిస్తాడు ..
ఉద్దండ గురువులెంతమందైనను
గురువులకే గురికలిగిన పూజ్య
గురుయోగ్యతల ప్రామాణికుడు ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment