ప్రత్యేక కవిత
తేదీ : 04-07-22
పరమ పూజ్యుడు పింగళి వెంకయ్య
కవిత సంఖ్య : 144+1
రైతు బిడ్డడే అయినా
రాజు వలె ఆలోచించాడు
ధ్వజముంటే భుజం భుజం
దన్నవుతుందని యోచించాడు ....
అహర్నిశలు స్వాతంత్య్రం
ఆవహించుకుని అవపోశన పట్టాడు...
ప్రజలను ఏకోన్ముఖులు గావించి
భిన్నత్వంలో ఏకత్వం సాధించ...
పౌరుషాల అరుణవర్ణం... ప్రశాంతతల
తెలుపుదనం ...పల్లె జీవనాన్ని
ప్రతిబింబించే పాడిపంటల
పచ్చదనం ... స్వదేశీ వస్త్రాలకై
నూలు వడుకు రాట్నం చిహ్నంగా ....
విశ్
జ్ఞానమే మూలమని గ్రహించి
పలు భాషల పాండిత్యం సాధించె..
ఎవుసమంటే మక్కువతో
మేలు రకం పత్తి కొరకు కృషి చేసె .....
పార్టీలకతీతంగా ప్రాంతాలకతీతంగా
నాడు నేడు ముందుముందు మన దేశానికి
నాలుగు కాలాలు నిలిచే పతాకమందించిన
పరమ పూజ్యుడు మన వెంకయ్య ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment