అంశం - నిశ్శబ్దం రాజ్యమేలిన వేల
తేదీ - 13-06-2019
శీర్షిక - నిర్వీర్యం సమస్త ప్రజాస్వామ్యం....
సంఖ్య - 210
శతాబ్దాల వలస వాదుల పాలనం
పోరి సాధించుకున్న స్వాతంత్య్రం
తీర్చి దిద్దుకున్న ప్రజాస్వామ్యం
కోరి సాగుతున్న సౌభ్రాతృత్వం...
అంతలోనే...
నమ్మిన కోటరీల మంత్రాంగం
నియంత పోకడల నాయకగణం
నిమ్మకు నీరెత్తిన అధికారగణం
చెప్పింది చేసిన అధ్యక్షపీఠం....
నోరు మెతకైన కొంత స్వంత పార్టీ
అణచివేయబడ్డ ప్రతిపక్షగణం
వేల మంది నాయకుల నిర్బంధం
వెరసి మహామహుల కారాగారం...
పవిత్రమైన భారత చరితం
మరచిపోలేదు ఆ చీకటి కాలం
అంకురమైనది కర్కశానికి
ఏడు జూన్ పంతొమ్మిది వందల డెబ్భై ఐదున....
అంతర్గత పాలనా భంగమంటూ
అభ్యంతర వార్తలు వద్దంటూ
పత్రికల స్వేచ్ఛ హరించి నోళ్లు నొక్కేసి
నిర్వీర్యం సమస్త ప్రజాస్వామ్యం...
మరువలేదు ఆ తరం మరుజన్మకైనా
నిశ్శబ్దం రాజ్యమేలిన వేళ......
ఇరువదొక్క నెల మన దేశాన
శూన్యమైన ప్రజాస్వామ్య పాలన....
నగునూరి రాజన్న
కరీంనగర్ (ప్రస్తుతం: USA)
No comments:
Post a Comment