అంశం - గరికపూలవనం
తేదీ -19-06-2019
శీర్షిక - యుగం మారినా జగాన వెలగాలి .
గంగి గోవు పాలు గరిటడైన చాలన్నట్లు
మన్నన లేని మహా రాజులెందరో మహిన ....
లెక్క తెలియనంత.. చరిత్రకెక్కనంత ....
కాని మానవత్వం మూర్తీభవించిన
మనసున్న మారాజులంతా శ్రీరామచంద్రులే ....
యుగాలు మారినా జగాన వెలిగేది...
రాశి కన్నా వాశి గొప్పదన్నట్టు
కౌరవులు లెక్కకు నూరయినా
సత్తా చాటినోళ్లు ఒకరో ఇద్దరో.....
పాండవులు నిక్కచ్చిగా ఐదుగురే అయినా....
అన్నింటిలో ఆరితేరినవారు.....
దైవ చేయూత పొందినవారు .....
అందరూ ఆ దైవాంశులే అయినా ...
మన పాలక నాయకులవలె
ఆయన కృప పొందేది ఎందరికో ....
ఈ శకపు ప్రజా మనో రంజకునివలె ...
కాలేరు సమం మన కలాం గారికి....
గంపెడైతేనేమి గరిక పూల వనం
సుందరానికి తప్ప సువాసనలు లేక
అందానికి తప్ప అలంకారానికి నోచుకోక
ఆహ్లాదానికి తప్ప దైవార్పణ దరిచేరక
మనోరంజకానికి తప్ప పూజకు పనికి రానివి...
నగునూరి రాజన్న
కరీంనగర్ (ప్రస్తుతం: USA)
No comments:
Post a Comment