చిత్రకవిత
తేది : 02-07-2021శీర్షిక : పల్లె తల్లి
కవిత సంఖ్య : 34
నాగరికతల నడకలలో యువత
అడుగులు తడబడుతుంటే
రాజకీయపు రంగుల కోలాటంలో
పల్లె నీడన బతుకులు భారమాయె...
చేతి వృత్తులు మాయమై పోయి
యువత బ్రతుకు చిత్రాలు... ఛిద్రమై
పట్నపు చత్తుల కింద పది గజాల
గదులలో కాపలా బంట్లుగా మారె ...
మాతృ గడ్డపై మమతలు వీడని
పెద్దమనుషులు మాత్రం ఇంకా
చేతులు కాల్చుకుంటూ కాలం
వెళ్లదీస్తూ శివుని ఆజ్ఞకై వేచుచుండె ...
వట్టి పోయిన పాడి పశువులాంటి
పాటి గాని పాలకుల మాటలు
కడుపు నింపవు సరి కదా ... కనీసం
కంటి వెలుగులు ఇంటికందనీయవు ….
కాంతి నిండుకున్న గదిలోకి
నేనున్నానంటూ పలుకరిస్తున్న
దినకరుని వెలుగులో దివ్యంగా
అవ్వ బువ్వ వండుకొనుచుండె
ఆత్మ స్థైర్యంగా కట్టెలపొయ్యి పై ....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment