మరలివచ్చిన వసంతం
తేది: 10-05-2022
శీర్షిక : మానవాళికే మచ్చుతునక
కవిత సంఖ్య : 900
కలుషితాల పలకరింపులో
కాలుష్యాల విషపు కాటులో
అతివృష్టిలు అకాలవృష్టిలు
వెంబడించి అతలాకుతలం చేసినా ....
అనావృష్టి ఎడారులన్నీ కల కలిసి
గుండె లోతుల్లో తడారుస్తుంటే...మంటలకు
ఓ కంట కన్నీరు ఒలకబోస్తూనే....మరోకంట
నిబ్బరాల గుండె చిక్కపట్టుకుని తొలకరిలో
ఏరువాకకు సిద్ధమయ్యే హాలికుడే లేకుంటే ...
రెండు నాల్కల సరీసృపాల్లాంటి
పాలకుల మాటలకు ఉబ్బి తబ్బిబవ్వక....
పక్కాగా నిభాయించుకుని... స్వయంకృషిని
నమ్ముకుని...నాలుగడుగులు వేయకుంటే ....
మానవతల మచ్చుతునక మనసున్న
మారాజు కర్శకుడే కనిపెట్టుకోపోతే...
మానవాళి జీవితంలో మరలి వచ్చేదా వసంతం...
పచ్చగా పదికాలాలు మనమంతా ఫరిఢవిల్ల ....
అన్నపానీయాలుంటే అన్నీ ఉన్నట్టే...
పెరుగుతున్న జనాభాకు... పెంచలేని
వనరులతో...పెడుతున్న గుప్పెడు గింజలకు ....
జీవితాంతం రుణపడి ఉండాల్సిందే రైతన్నకు .....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment