మౌనమే సంఘర్శించిన వేళ
తేది : 21-12-2022
శీర్షిక : యాంత్రికత ....
కవిత సంఖ్య : సహస్రాధికం
అవిభాజ్యాల కనుమరుగులతో
చింతలు లేని చిన్నకుటుంబాలంటూ ...
చుక్కల్లో చేరిన బతుకు నావకు
చక్కపెడుతున్నారు ఇద్దరేసి ఉద్యోగాలతో ...
ఉరుకుల పరుగుల జీవితాలకు
ఉడకేసుకునే తీరికలే కరువు ....
డబ్బు జబ్బులే అన్ని సమస్యలకు
ఔషధాలనే భ్రమల తీరంలో పయనమౌతూ ....
పట్టీ పట్టని పిల్లల పెంపకం ....
చూసీ చూడని చదువుల మేళం ...
అన్నీ అమర్చి... వాళ్ళ కలల తీరం
వీళ్ళను చేరమంటూ...పోరుబాటలు...
అరిగే దాకా రుద్దేస్తున్న....అమ్మానా న్నలు ...
పతాక శీర్షికలతో పదిలమవ్వాలని
బొక్కసాలు నింపుకునే ధ్యాసలే గాని
కలుషితాల కార్పొరేట్ కళాశాలలకు...
పొంగే పాలను పొదువుకునే అంచులు
లేని పాత్రలే ...అటు ఉపన్యాసకులు...
యాంత్రికతలు నిండిన విశ్వవీధిలో
మనుషులను మనసులను మృదువుగా
స్పృశించకుండానే ....మాటు వేస్తున్నారు ...
లెక్కలేనన్ని బలవన్మరణాలు...లెక్క తేలని
గణాంకాలు....బొక్క బోర్లానే... ప్రతీ విద్యా
సంవత్సరం... మౌనమే సంఘర్షించగా ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment