బరువెక్కిన మాటలు
తేది : 19-12-202
శీర్షిక : మట్టి పరిమళాలు ఆఘ్రాణింపజేయాలి ...
కవిత సంఖ్య : సహస్రాధికం
ఓర్చిన మనిషి నేర్చుకున్నాడా ?
నేర్చిన మనిషి ప్రదర్శిస్తున్నాడా ?
గారాలను వదిలి గాయాలనే చేస్తూ
మేక వన్నె పులులై సంచరిస్తున్నారు ...
కుసుమ కోమలమైన గుండెలు
బండబారిపోతున్నాయి...
మెండుగా దినపత్రికలన్నీ
నిండిన కసాయి వార్తలతో
కకావికలమై చదవలేక ....
అనురాగపు కొమ్మల అపురూపాల
అకాల విధ్వంసం జరిగిపోతూంటే ....
వరసబెట్టి వస్తున్న కథనాల ఊసులు
గునపాలై గుండెల్లో గుచ్చుకుంటున్నాయి ....
నీళ్లన్నీ ఇంకిపోయి కళ్లన్నీ ఎడారులే....
ఆత్మీయతల ఆనవాళ్ళన్నీ కొండెక్కి
అమానుషుంగా అచేతనమౌతుంటే...
మమతల తేమ లేక మనిషి తెప్పరిల్లి పోలేక...
గ్రీష్మమై పోతున్న మనిషి జాడలను
చిరుజల్లుల తొలకరితో పలకరించి
మట్టి పరిమళాలను వెదజల్లి
గట్టిగా తట్టి లేపి ఆఘ్రాణింపజేయాలి ...
No comments:
Post a Comment