Friday, August 2, 2019

కలి కాలం

అంశం - కలి కాలం
తేదీ - 31-07-2019
శీర్షిక - యథా రాజా తథా ప్రజా .... 
సంఖ్య - 250 

ఒంటి కాలుపై నిలిచిన ధర్మం 
ఇంటి నుండే ఇరుకు పరిస్థితి...  
అవిభాజ్యాల అలికిడి లేదు .... సరికదా !
అమ్మా నాన్నలే బరువవుతున్నారు..... 

ఆశ ఉంటే ఉన్నతమైన 
ఆశయాలు ఏర్పరుచుకోవచ్చు....  కానీ !
అత్యాశ పేరాశలతో స్వార్థాలు పెంచుకుని 
కపటం మోసాలతోనే  సావాసం చేస్తున్నారు.... 

నమ్మకంతోనే నడుస్తుంది 
ప్రపంచమంతా అంటుంటారు.... అంతా హుళక్కే !
తమ పర బేధాలసలే  లేవంటూ  
నమ్మినవారినే నట్టేట ముంచుతున్నారు .... 

మనిషి హోదా పెరిగితే 
ప్రవర్తన ఉదాహరించబడాలంటారు ..... మాయ !
పౌరులు పాలకులైతే 
పచ్చ నోట్లే చలామణి అవుతున్నాయి..... 

యథా రాజా తథా ప్రజా 
ఏమిటో ఇప్పటికి కానీ బోధపడింది .... అవతారం !
గుర్రమెక్కి కత్తి పట్టింది 
కలి మాయలో పడిందన్నమాట..... 

నగునూరి రాజన్న 
కరీంనగర్ (ప్రస్తుతం USA) 

No comments:

Post a Comment