శీర్షిక : అలసత్వం ప్రాణాలకు ముప్పు...
తేది: 05-04-2020
కల్తీలకు కాలుష్యాలకు
కాలమాన పరిస్థితులకు
కలికాలపు నీతులు సైతం
కరోనాపై కప్పుకుంటున్నాయి దుప్పట్లు...
ఇన్నాళ్ల ప్రేమలు ఆప్యాయతలు
ఇంత కపటాన్ని మోసాయా!
తరాలు మారినా తరగని
స్వార్థాలను మూటగట్టాయా!
మనం ఆనుకున్న వాళ్లంతా
మనిషిని వదిలి స్వార్థంకోసం
మాత్రమే బతుకుతున్నారా!
మర మనిషిగా నిలిచిపోతున్నారా!
ఎవరికొరకు ఈ దాపరికం
ఎందుకొరకు ఈ దాగుడుమూతలు !
పాలకుల పబ్బతుల కన్నా
ప్రాణ విలువలకన్నా మిన్ననా మిత్రమా !
కన్నవారిని కట్టుకున్నోళ్లను
కనిపెంచిన పిల్లలను
కబరస్తానులకు పంపేంత
కర్కోటకంగా ఎలా మారారు!
ఆడవారు లేకుండా
అడ్రస్ లేదు మనిషికి...
అసలు పిల్లలు లేకుండా
అర్థముండదు మనుగడకే !
చివరాఖరుకు సవ్యదిశన
సంఘ పురోభివృద్ధికై నిలిచే
సత్సంతానార్థం సాగించే వ్యవస్థ
సైతం కుంటుపడే కుత్చితం....!
రాముడైనా రహీముడైనా
ఒకటే మాట ఒకటే భావం
మనుషులంతా ఒకటేనని !
మనిషిలోనే దైవం చూడమని!
నగునూరి రాజన్న
కరీంనగర్
(After seeing warangal incident news... because of his delay nine family members were infected with carona out of which 3 are children)
No comments:
Post a Comment