జగత్కల్యాణం
02-04-2020
శీర్షిక : అపురూప కళ్యాణం
సంఖ్య - 383
యుగం మారినా
జగం మెచ్చిన రాజు
కాలం కదులుతున్నా
జనం కోరుకునే రాజరికం...
పితృవాక్య పరిపాలనమే
పిల్లలకు శిరోధార్యమన్నాడు...
ప్రజాక్షేమము కోరిన ప్రజ్ఞాశాలి....
పాలక పగడపు శిరోమణి.....
ఇనవంశోత్తమ దశరథ నందనుడు ....
సిరుల తల్లి శ్రీలక్ష్మియే
సీతమ్మగా జనియించె...
కారణ జన్మురాలై మిథిలా
జనకుని ఇంట జానకిగా...
పెళ పెళ శివ ధనుస్సు విరవగానే
గల గల నవ్విన నవవధువు సీత
తడబడు అడుగుల రామయ్య దరిచేరి
వడి వడిగ అలంకరించె మెడలో వరమాల ..
ఆకాశమంత చలువ పందిళ్లు
భూదేవంత ముగ్గు లోగిళ్ళతో
జగతి మొత్తంగా జరుపుకునే
జగజ్జనని రామయ్యల అపురూప కళ్యాణం...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment