Monday, April 20, 2020

రాజ ధర్మం 8-4-20

రాజ ధర్మం 
తేదీ 08-04-2020
శీర్షిక - సత్యం ... 
సంఖ్య - 388

రాజుల రోజులు పోయి 
రాజ్యాలు మారినా .... 
రాజ ధర్మం మాత్రం సత్యం 
ప్రజల సంక్షేమమే పరమార్థం .... 

యుగాలు మారినా 
జగాలు మెచ్చే రారాజు 
జనాల మనసు గెలిచిన 
జగదేకవీరుడు ... శ్రీరామచంద్రుడు.

రంగులు మార్చే రాజకీయాలు 
హంగులు ప్రదర్శించే వేదికలు 
ప్రజల్ని బాగోగుల్ని గాలికొదిలి 
పటాటోపాలకి చిరునామాలౌతున్నాయి.... 

శాశ్వతాలను వదిలేస్తూ  
తాత్కాలికాలపై మోజులు పెంచుకునే 
ఆధునిక  స్వార్థ పాలనల పోకడలకు 
అసలైన పాఠం నేర్పిస్తూనే ఉంటుంది...  

బాధ్యతలు మరిచిన ప్రజలకు  
పద్ధతులు మరిచిన  పాలకులకు 
దండనలు దహించివేస్తూ 
పరిస్థితులే పాఠం నేర్పిస్తుందనేదానికి 
ప్రత్యక్ష సాక్ష్యం ప్రతీసారి పరిపాటే.... 
 
నగునూరి రాజన్న 
హైదరాబాదు.   

No comments:

Post a Comment