Monday, September 3, 2018

బృందా విహారి

అంశం : గోకులాష్టమి 
శీర్షిక : బృందా విహారి 
03-09-2018
సంఖ్య : 47

దేవకీ సుతుండు దైవాంశ సంభూతుడు
అష్టమ గర్బంగా అవతరించాడు.  
అష్టమీ తిథియందు కష్టములు బాప 
అష్ట సఖులకు తాను ఇష్టపతి యైనాడు . 
 
వసుదేవ తనయుండు వామనావతారుండు        
ఆదిశేష శయనుండు ఆపద్బాంధవుడయ్యె. 
యదుకుల భూషణుండు యశోద నందనుడు 
మన్ను తిన్నా మిన్ను చూపి, గోవర్ధమెత్తి  రేపల్లె కాపాడె . 
 
పాలు మీగడల వెన్న దొంగ,  పాలపుంతల కలయిక 
పడతుల వస్త్రములు దాచి శరణు వేడించే.  
కంసున్ని మర్దించి, కాళీయునిపై నర్తించి 
కమల లోచనుండు కరుణించె  దీనుల. 

అఖిలాండ  నాయకుడు ఆది మధ్యాంత రహితుడు
జగన్నాటక సూత్రుడు భారతాన్ని బాధ్యతగా నడిపాడు . 
మానవుడే మాధవుడై గీత బోధించి ధర్మ రక్షణకు నిలిచి 
శిష్ట రక్షణకై పాండవపక్ష పాతియైనాడు.

చిన్ని చిన్ని పాదాల శ్రీ కృష్ణమూర్తి 
వేగమే రావయ్యా బృందా విహారి మా ఇంటికి 
వేవేల జపియింతు వేద పురుషా  నీ రాకకై 
వేణు మాధవా ! దీన బాంధవా ! మమ్ము బ్రోవరా !

నగునూరి రాజన్న 
కరీంనగర్ 

No comments:

Post a Comment