Friday, July 14, 2017

ప్రజలు - ప్రజాస్వామ్యం- ప్రజానాయకులు

ప్రజాస్వామ్యమంటే ప్రజలు

ప్రజలచేత ప్రజలకొరకు అనే వాక్యాన్ని


ప్రజానాయకులు భలేగా వాడుకుని  

ప్రయోజనాలు పొందుతున్నారు 


ప్రభుత్వ ప్రగతి రథానికి   ఇరుసు లాంటి జనాన్ని 


ఇంధనం లాంటి వారి ధనాన్ని  

ఇచ్చమైన  విధముగా రచ్చకీడుస్తున్నారు  


భూములమ్ముకుని కొందరు  స్పెక్ట్రంలనమ్ముకుని కొందరు 


ఇండ్లనమ్ముకుని కొందరు  బొగ్గు ఘనులనమ్ముకుని ఇంకొందరు 


కాదేది కవిత కనర్హం  అని   అన్నాడో మహా కవి ఆనాడు 


అన్నీ అర్హమే నాయకులకు   అమాంతం మింగేయడానికి ఈనాడు 


ఒకటి కాదు, రెండు కాదు  వేల వేలకోట్లు  కాదు  

లక్ష కోట్లు ,కాదు కాదు - కోటి కోట్లు 


లగాయించి మింగుతున్నారు  లజ్జలేని కొందరు నాయకగణం 


ఆశకు అంతు లేదన్న నానుడికి  ప్రతీకగా నిలుస్తున్నారు 


పదవులనడ్డం పెట్టుకుని  పంది  కొక్కులవలె కబలిస్తున్నారు 


"తోలు తిత్తికి తొమ్మిది రంద్రాలని" తెలిసి -పాపం పండి బయట పడినా 


సిగ్గు ఎగ్గులు వదిలి పెట్టి  - సింగారించుక 

తిరుగుతున్నారు ప్రజల మధ్య మళ్ళీ

"మడుం బంగారం కన్నా మాసం ఎత్తు హుకుం మిన్న

అన్న విధంగా మేధావుల మేధో మదనం తో 


సంఘ జీవులపై సదా పన్నులు విధిస్తూ  - 

సంపద సృష్టిస్తున్నారు ప్రభుత్వంపేరు మీద 


అధికారం లో ఉన్నవాళ్ళు కొన్నాళ్ళు  

ఆప్పో జిషన్ లో  ఉన్నవాళ్ళు కొన్నాళ్ళు 


వంతుల వారీగా వారి సీట్లు మార్చుకుని  

పోటీలు పడుతున్నారు దోచుకోడానికి 


తప్పు అని నిలదీసినోన్ని  తనని తగలేస్తున్నారు  కాదంటే 

ఊరకుక్కల వలె ఉరుముతున్నరు  భయ భ్రాంతులకు గురి చేస్తున్నరు

No comments:

Post a Comment