మాతృ భాష అనగానే -మనసు పులకరిస్తుంది
మమత వెళ్లి విరుస్తుంది -మమేకం అవుదాం అనిపిస్తుంది
అచ్చులు పదహారు- హల్లులు ముప్పదెనిమిది
ఉభయాక్షరములు మూడింటితో-వర్ధిల్లుచున్నది తెలుగు వర్ణమాల
రాయల కాలములోనే - రాచ మర్యాదలు అందుకున్నది
అష్ట దిగ్గజములతో అలరించి -అపర ఖ్యాతిని పొందినది
ఎందరెందరో మహానుభావులకు - ఏలికగా నిలిచి ఖ్యాతి తెచ్చినది
నాటి నుండి నేటి వరకు వారధిలా నిలిచినది-తెలుగు వారికి గౌరవాన్ని కూర్చినది
నన్నయ్య, తిక్కన, ఎర్రన, పెద్దన - శ్రీనాథుడు,మొల్ల,తిమ్మన
అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు ,గురుజాడ ,
విశ్వనాథుడు, జాషువా, శ్రీ శ్రీ, సి నా రే ఆదిగా గల అందరూ
ఆ తల్లి సేవలో తరించిన కన్న బిడ్డలే
పాలు మీగడలకన్నా, తేనె ధారలకన్నా -మధురమైనది మన మాతృ భాష
పరికించు మిత్రమా బహు లెస్సగా - అమ్మ లాలి పాటలే అందుకు సాక్ష్యం
పరాయి భాషలకు కిరాయి మనుషులుగా - సంకర భాషలకు దాసోహం అనకుండా
మాతృ భాషా మహాత్యాన్ని గుర్తించుదాం - మనవంతు కర్తవ్యాన్ని నిర్వహిద్దాం
బ్రౌన్ లాంటి పరదేశీయుడే - బహులెస్సగ ప్రాకులాడి
భాషాభివృద్దికి నిలిచాడు - బహుళ ప్రాచుర్యం పొందినాడు
భాషా భాగములు, వ్యాకరణ ఛందస్సులు-సంస్కృత సంధులు , సంక్లిష్ట సమాసములు కాదు
సరళమైన భాష పైన స్వచ్చమైన అభిమానం చాలు-పది కాలములు పదిలముగా నిలుపుటకు
ముత్యమంటి అక్షరముల - మాతృ భాష మకరందము
ముద్దులొలుకు పదకూర్పుల - మమకారముతో నింపుదాం
ఆత్మీయత జోడిస్తూ - ఆదరిస్తూ ఎల్లప్పుడు
ముందు తరాలకు అందిద్దాం - ముచ్చటైన మార్గ దర్శకముగా...
No comments:
Post a Comment