ప్రత్యేక కవిత 21-10-2020
పోలీసు సంస్మరణ దినము.
జైహింద్..
కోట్ల కుటుంబాల కోకొల్లల
సుఖ సంతోషాలకు
కడుపుకు ఇంత తిని
కంటి నిండా నిద్ర పోవడానికి ....
కంటి రెప్పల కవాటాలాను
తలుపులు తీసిన వాకిటలా
ఆకలి దప్పులు అటకెక్కించి
నిద్రాహారాలు ఉద్దెర చేసి ....
ప్రజా క్షేమమే పంచప్రాణాలుగా
శాంతి భద్రతలే కాంతి శ్వాసలుగా
ప్రజల పయనమైనా శయనమైనా
పదిలపరిచేరు ప్రతినిమిషం ....
పండు వెన్నెలలు పంచే
చల్లని చంద్రునిలోని ఛాయలా
అక్కడక్కడా అల్పుల అచ్చాదనలు
పొడసూపినా చేయెత్తి జై కొట్టి
చాతి పొంగించి పొర్లాడే గర్వకారణమే...
బాధ్యతల బందీలో ప్రాణాలను
తృణప్రాయంగా అర్పించిన
అమరవీరులకు ఆత్మీయంగా
శిరసు వంచి నమస్కరిస్తూ ...!
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment