అంశం : నాన బియ్యం బతుకమ్మ
తేది : 20-10-2020
శీర్షిక : నవరాత్రి నాల్గవ రోజు
సంఖ్య : 015
రంగు రంగుల పూల పండుగ
రమ్యమైన తెలంగాణా పండుగ
రంగవల్లుల సుందరంగ తీర్చి దిద్ది
రమణులంతా గూడి స్వాగతించేరు...
ముగ్గురమ్మల మూలపుటమ్మ
చాలా పెద్దమ్మ దుర్గమ్మను
ముదముగ కొలుతురు
పసుపు కుంకుమలర్పించి
పలురకాల పూలతో పవిత్రముగ...
రాక్షస పాలనల కాలములో
వల వల లాడిన ప్రజలంత
జనపదములనే జతచేసుకుని
జనని జగన్మాతను వేడుకొనిరి....
అన్నపూర్ణగా కొలిచే అమ్మకు
నానిన బియ్యమునే నైవేద్యం
ఆనవాయితీగా సమర్పించేరు
సన్నుతించి సల్లగ చూడమని
కోరుతూ నాల్గవ రోజున......
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment