అంశము: మానవ ముద్ర
తేది: 14:10:2020
శీర్షిక : నవయుగ మానవ ముద్రితుడు...
సంఖ్య : 540
రాతి యుగమైనా రాజుల యుగమైనా
అడుగడుగున కనబడే కాలమాన
పరిస్థితులకు కదిలి సాగుతున్న
నాగరికత మార్పులే కనులకు సాక్ష్యమయ్యే
మానవ బుద్ది చాతుర్యాల ముద్రితాలు....
భాష తోనే బహు ప్రాచుర్యం
భారతాన నిలిచె చరిత్రలోన
శాతవాహనులు ఏలిరని
తొలి తెలుగు తరం రాజులుగ....
పల్లవులు చాళుక్యులు
పవిత్రంగ నిర్మించిన
పలు ఆలయాల ప్రాంగణాలే
పరమ ధార్మికతకు సాక్ష్యం...
చక్రం పనిముట్లతో
చక చక పరుగు పెట్టి
పారిశ్రామికీకరణలతో
సవ్యసాచిగా మారిపోయి ....
ప్రగతి మెట్లెక్కి సాంకేతిక
సొబగుళ్ళుద్దుకుని విశ్వాన్నే
గుప్పెట బంధించుకున్న
నవతరం మానవుడు కూడ
నవయుగ మానవ ముద్రితుడు...
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment