పంచభూతములు
పైసా ఖర్చు అవసరం లేని పవిత్ర మూర్తులే
ప్రతి జీవకోటికి సర్వ సమానములే అయినా
పెత్తనమౌతున్నది బలమున్నోడిదే మొదటినుండి
ప్రపంచ యుద్ధాల పరిణామం చూస్తే
పరికించవచ్చు వాటి ఫలితాల రూపం
"భూమి" ," సంపదే" ప్రధాన సమస్య నాడు
మానవ స్వార్థపు మరణ శాసనాలైనాయి
నాగరికతకు కేంద్ర బిందువులు నదీమ తల్లులు
తాగు నీటికి, సాగు నీటికి కట కట ఈనాడు
నీటి ఎద్దడే ఈ శతాబ్దపు అత్యంత ప్రధాన సమస్య
ప్రజలు, ప్రభుత్వాలు పరిణతితో ప్రయత్నించాలి నివారణకు
మూడు వంతుల నీటితో ఒక వంతు భూమితో
ముందే తెలిపింది ప్రకృతి మానవాళికి
జీవకోటికి ప్రాణాధారం నీరే ముఖ్యమని
అయినా మారరు అలక్ష్యము చేస్తూనే ఉన్నారు.
ప్రతీ ఏడు గడుస్తూనే ఉంది స్వాతంత్య్రం నాటి నుండి
ప్రణాళికలు వేస్తూ, పద్దులు కేటాయిస్తూనే ఉన్నారు
పనులు ఎన్నో చేస్తునే ఉన్నారు... నామ మాత్రంగా
పద్దులు ఖర్చు రాస్తూనే ఉన్నారు... ఖజానాకు మాత్రం
ఆవగింజంత మార్పు రాదు, అయినా రానీయరు
అధికారులు,నాయకులకు ఆరాటాలు కావలి ......
ఆర్భాటాలు చేస్తూండాలి.... అంచానాలు వేస్తుండాలి...
అనంతంగా సాగదీస్తూ కాలం వెళ్లబుచ్చుతూండాలి...
నీటిని కొంటూ నిలదొక్కుకుంటున్నారు ప్రాణాలు
గాలిని కొనే రోజులు ఎంతో దూరం లేవనిపిస్తుంటది
No comments:
Post a Comment