భారత జాతీయ త్రివర్ణ పతాకం
జాతీయ గీతం ఆలపిస్తూ
నర నరానా పౌరుషం ఉప్పొంగ
తనువంతా పులకించ
జాతి పతాకానికి దేశ జనులంతా
వందనమిడెదరు వినయంగా
దాస్య శృంఖలాలను దునుమాడి
స్వాతంత్య్రం సాధించుకుని
సంబరాలు జరుపుకునే రోజు.
కాషాయ వర్ణమేమో
కదన రంగపు కొదమ సింహాల
పౌరుషాలకు ప్రతీకగా,
శ్వేత వర్ణం విశ్వ శాంతికి
సంకేతమై నిలువగా,
అశోక చక్రం అందంగా
తెలుపు మధ్యలో 24 రేఖలతో
ధర్మ చక్రమై వెళ్లి విరియంగ,
ఆకు పచ్చ వర్ణం
అన్న దాత రైతన్న
పసిడి పంటలకు
చిరు చిహ్నంగా
అలరారినది చిరకాలంగా
మన పింగళి వెంకన్న
తీర్చి దిద్దంగ త్రివర్ణాలు
మన దేశ జాతీయ పతాకాన.
No comments:
Post a Comment