Thursday, August 16, 2018

త్రివర్ణ పతాకం

భారత జాతీయ త్రివర్ణ పతాకం  

జాతీయ గీతం ఆలపిస్తూ 
నర నరానా పౌరుషం ఉప్పొంగ 
తనువంతా పులకించ 
జాతి పతాకానికి దేశ జనులంతా 
వందనమిడెదరు వినయంగా  
దాస్య శృంఖలాలను దునుమాడి 
స్వాతంత్య్రం సాధించుకుని 
సంబరాలు జరుపుకునే రోజు.  

కాషాయ వర్ణమేమో  
కదన రంగపు కొదమ సింహాల
పౌరుషాలకు ప్రతీకగా, 
శ్వేత వర్ణం విశ్వ శాంతికి 
సంకేతమై నిలువగా,
అశోక చక్రం అందంగా 
తెలుపు మధ్యలో 24 రేఖలతో 
ధర్మ చక్రమై వెళ్లి విరియంగ, 
ఆకు పచ్చ వర్ణం
అన్న దాత రైతన్న
పసిడి పంటలకు 
చిరు చిహ్నంగా 
అలరారినది చిరకాలంగా 
మన పింగళి వెంకన్న 
తీర్చి దిద్దంగ  త్రివర్ణాలు 
మన దేశ జాతీయ పతాకాన.  

No comments:

Post a Comment