నగునూరి రాజన్న
కథా రచన - 2
శీర్షిక : తప్పు కొమ్ము కాసిన వైనం....
అంశం :
"అందరికీ అదేపనిగా సలహాలిస్తూ ముందుకు సాగిపోతున్న అతనికి ఇతరులు చెప్పేదాకా తన పొరపాటును గ్రహించలేకపోవడంతో సిగ్గుతో
తల దించుకున్నాడు. తన దాకా వస్తే గాని తెలియని తనానికి నామోషీగా ఫీలయ్యాడు.
****************************** *******************************************
చుట్టూ కొండలు కోనలు జీవనది లాంటి సెలయేరు పచ్చని పంట పొలాలతో పాడి ఆలమందలతో విశాల మైదానాలతో రెండు చెరువులతో కళ కళలాడే
రామాపురం అనే 500 కుటుంబాలున్న గ్రామంలో బడే మియా చోటే మియా అనే ఇద్దరు అన్నదమ్ములున్నారు. బడేమియా చో టేమియా వారి పూర్వీకులనుండి
పుణికి పుచ్చుకున్న జమీందారీ కుటుంబ సంతతి .
స్వాతంత్య్రనికి ముందు రజాకార్ల బెడద రాకుండా ఆ ఊరి ప్రజలను కంటికి రెప్పలా కాచుకుని చూసుకున్నారు. స్వతహాగా ముస్లిం కుటుంబాలే అయినా, వారి తండ్రి గారి హయామునుండి చక్కగా ప్రజారంజకంగా పాలిస్తూ వస్తున్నారు. అందువలన ఆ ఊరి ప్రజలకు కూడా వారంటే ఎంతో మర్వాద మరియు వారి మాటలకు ఎంతో గౌరవం ఇస్తూ వస్తున్నారు. ఇక ఆ ఊరిలో ఎవరికైనా ఎలాంటి చిన్నా పెద్ద సమస్యలకైనా , వ్యక్తిగతమైన విషయాలకు గాని కుటుంబ విషయాలకు గాని, పిల్లలకు పెద్దలకు అనే తేడా లేకుండా అన్ని విషయాలలో అందరికి సమయానుకూలంగా ఆ బడేమియా సలహాలిస్తూ వస్తున్నారు. ఎలాంటి చిన్న చిన్న విషయాలకైనా పెద్ద విషయాలైనా అందరికి అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు అన్నీ పరిష్కరించుకుంటూ వస్తున్నారు.
కానీ వారి తండ్రుల హయామునకు వీరి హయామునకు నిబద్దతలో.... కనిపించని తేడాలు పొడ సూపుతూ వచ్చాయి. దానితో మెల్ల మెల్లగా ప్రజలపై పట్టు సడలుతూ వస్తున్నది. కానీ పెద్దరికానికి అలవాటు పడ్డ వారు కదా...... వారికే కాదు వారి అనుయాయులకు కూడా కొంత అసహనం పెరుగుతూ వస్తున్నది.
అలాగే దేశ స్వతంత్రం వచ్చిన తదుపరి మారిన పరిస్థితులకు కూడా కొన్ని మోతుబరి రైతు కుటుంబాల నుండి మెల్ల మెల్లగా ప్రశ్నించే తత్వం మొదలయ్యింది.
ఇలాంటి విచిత్రమైన పరిస్థితులలో అనుకోకుండా ఒకరోజు ఓ వింత సమస్య తలెత్తింది. బడే మియా అనుయాయుడైన హుస్సేన్ అనే వ్యక్తి రంగయ్య గౌడ్
అనే అతని వద్ద ప్రతి రోజు వెళ్లి కల్లు తాగే వాడు. అలా అలా రంగయ్య గౌడ్ కు హుస్సేన్ చాలా డబ్బులు బాకీ పడ్డాడు. రోజులాగే హుస్సేన్ ఆ రోజు కూడా రంగయ్య గౌడ్ వద్దకు వచ్చాడు. ఇంతలో రంగయ్య గౌడ్ పాత బాకీకై ఒత్తిడి చేసాడు. ఎప్పుడు మత్తుగా ఉండే హుస్సేన్ అసహనంతో తీవ్ర కోపానికి గురై నిర్లక్ష్యంగా మాట్లాడటం మొదలుపెట్టాడు . ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది.....కట్టలు తెంచుకున్న కోపంతో హుస్సేన్ ఒక్కసారిగా రంగయ్య గౌడ్ పై చేయి చేసుకున్నాడు.... అది చాలదన్నట్లు, అసహనంతో ఊగి పోతున్న హుస్సేన్ రంగయ్య గౌడ్ కు రక్తాలు కారేటట్టు కొట్టాడు. ఇంతలో జనం అందరు గుమికూడి అడ్డుకో బోయి హుస్సేన్ ను పట్టుకుందామనుకునే సరికి పారి పోయాడు.
ఇప్పుడు హుస్సేన్ వెళ్లి బడిమియా శరణు చొచ్చాడు. ఇక రంగయ్య గౌడ్ వెళ్లి ఆ ఊరి మోతుబరి రైతు మరియు పట్నం వరకు పలుకుబడి ఉన్న రామయ్య పటేల్ వద్దకు వెళ్లి జరిగినదంతా పూస గుచ్చినట్టు చెప్పి మద్దతు కోరాడు. ఆ వివాదం ఊర్లో చాలా మంది ముందే జరిగింది....మరియు న్యాయం కూడా రంగయ్య గౌడ్ వైపే ఉన్నది కాబట్టి ఊరి జనమంతా రంగయ్య గౌడ్ తో కూడి.....ఆ ఊరి పటేల్ వద్దకు వచ్చారు.
ఎప్పటినుండో రామయ్యపటేల్ మనసులో బడేమియాపై కొంత అస్పష్టమైన అయిష్టత ఉన్నది. దానికి తోడు ఇప్పుడు న్యాయం ధర్మం కలిసి వచ్చిన వ్యవహారం తన దగ్గరికే వచ్చింది. అనుకోకుండా ఊరు ఊరంతా ఒక్క మాటపై నిలబడి తనవైపే చూస్తున్నది. ఇంకేముంది ఇదే అదనుగా ఊరందరి తరపున నిలబడి బడేమియాను నిలదీసాడు.
ఎప్పుడు తన దగ్గరికి సలహాల కొరకు వచ్చే వారికి ఎవరిదో ఒకరిది తప్పు ఇంకొకరిద ఒప్పంటూ సలహాలిస్తూ పోతూ తీర్పులు చెప్పే బడేమియాకు, ఇవ్వాళ ఆశ్రిత పక్షపాతంతో అనుయాయుడన్న ఒకే ఒక్క కారణంతో హుస్సేన్ ను చేర దీసిన పొరపాటును జమిందారీ కుటుంబం గ్రహించుకునే లోపల..... ..... ఊరు మొత్తం ఒకవైపు నిలబడి పటేల్ ఆధ్వర్యములో ప్రశ్నించి, బడేమి యాది తప్పని చెప్పే సరికి, సిగ్గుతో తల దించుకున్నాడు. బడేమియా పనివలన అన్నదమ్ములిద్దరికి ఏకంగా తల తీసేసినంత పని అయ్యింది. అప్పుడు అన్నదమ్ములిద్దరూ సిగ్గుతో ఆ ఊరిలో ఉండలేక రాత్రికి రాత్రే అర్ధరాత్రి ఆ ఊరి వదిలి దగ్గరిలోని టౌనుకు వెళ్లిపోయారు.
అప్పడు కానీ ఆ ఊరి జనం శాంతించలేదు.
******
నగునూరి రాజన్న
కరీనగరము.
No comments:
Post a Comment