కారణ జన్ములు
తేది: 17-07-2020
శీర్షిక: తపో ధనులు విశ్వ చరితులు....
సంఖ్య: 467
మధురమైన కుసుమ సమం
మానవజన్మ మర్మ రహస్యం
ప్రయత్నించి పట్టుకుంటే తప్ప
పదిలమై నిలిచి పరిమళించదు
పరిచయమవదు ఈ ప్రపంచానికి ....
ప్రకృతిలో పరమాణువే అయినా
పుష్కలమై ఇమిడిన ప్రకృతి పరంపరను
పంచభూతాలలోని పసిడి తత్వాలను
పొదువుకోలేదు ఎందుకో...... మానవుడు
అడుగుజాడలను వదిలిపెడుతూ
నాగరికతంటూ అడుగులేస్తూ
నమ్మకాలను వమ్ము చేసుకుంటూ
స్వార్థాలను మూట గట్టుకుంటున్నాడు .....
యుగానికో ధర్మపాదం చొప్పున
తిలోదకాలిస్తూ... తిరోగమనం వైపు
మొగ్గు చూపుతూ... అడుగులు వేస్తూ ...
అధికభాగం ప్రేక్షక పాత్రలకు పరిమితమై
భౌతికవాదమే బ్రహాపదార్థమన్నంతా
భద్రంగా కదులుతున్నారు....
కొద్దిమంది మాత్రమే సానబెట్టుకుని
మెరుగులు దిద్దుకుని స్వర్ణమద్దుకుని
తపోధనులై ధన్యమూర్తులై విశ్వచరితులై
వెలుగులీనుతూ చరితార్థులౌతున్నారు....
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment